ఇటీవల మార్కెట్టులోకి పిసి టాబ్లేటు విడుదల:
కొత్తగా HCL ఇన్ఫో సిస్టము వారు మార్కెట్టు లోకి 2 టాబ్లేటు పీసీలను విడుదల చేసింది. వీటిలో hcl me u1 ధర 7 999 రూపాయలు గాను మైఎద్యుతాబ్ రేటు సుమారు 9999 నుండి 11499 వరకు ఉంటుంది. ఆన్ద్రాయిడ్ ఐస్ కరీం సాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం తో పనిచేస్తున్న యూ 1 ఏడు అంగుళాల టచ్ స్క్రీన్, 1 గిగా హెర్ట్జ్ ప్రాసెసర్ ఉంటుంది. 4 జీబీ ఇంటర్నల్ మెమొరి లాంటి ఫీచర్లుఉన్న ఈ టాబ్లేట్టులో వైఫై పనిచేస్తుంది. విద్యార్ధుల కోసం అని మైఎడ్యుటాబులో ఇతరమైన ఎడ్యు కేషనల్ అప్లికేషన్స్, ఫ్రీలోడెడ్ గా యెన్ సి ఈ ఆర్ టి పా ట్యపుస్తకాలను కంపని ఉచితంగా అందిస్తుంది. ఇది కూడా యూ 1 టాబ్ మాదిరిగానే ఉంటుంది. కాని దీని ధర కొంచెం ఎక్కువగా ఉంటుందని hcl కంపెని ఈవిపి అద్వాని అన్నారు. కేర్ హాస్పటలు యొక్క వైద్యసేవల పై అంతర్జాతీయ ఈక్విటి సంస్థ యొక్క భారి పెట్టుబడి: అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటి సంస్థ ఆడ్వెంట్ ఇంటర్నేషనల్ కేర్ హాస్పటల్స్ లో 523 కోట్ల రూపాయలతో వాటాను కొనుగోలు చేస్తున్నట్లు సోమవారం తెలిపింది. 2012 లో ఒక పీ ఈ కంపెని ఇంత పెద్ద మొత్తములో పెట్టుబడి పెట్టడం ఇదే మొదటి సారి. ఈ కంపెని ప్రపంచం మొత్తం మీద సుమారు 30 కి పైనే ఆరోగ్య సంస్థల్లో తమ పెట్టుబడులని పెట్టింది. ఈ విధమైన పంథా ద్వారా కేర్ తన యొక్క వైద్య సేవలను ఇంకా ప్రజలలోకి తీసుకోన వెళ్లగలదని కేర్ ఫౌండర్ డాక్టర్ బి. సోమరాజు అన్నారు. ప్రస్తుతం కేర్ ఆసుపత్రిలో ఉన్న పడకల సంఖ్యను 1600 నుండి 3200 వరకు వచ్చే మూడేళ్ళలో దాటుతుందని సోమ రాజు తెలిపారు.
వోడా ఫోను విషయంపై బ్రిటను ఆందోళన:
వోడా ఫోను కేసు విషయమై కేంద్రం ఎదురుకొన్న దెబ్బ వలన కేంద్రం ప్రతి పాడించిన ఆదాయపు పన్ను సవరణ బ్రిటన్ను ఆందోళన పరుస్తుంది. హచిసన్ ఎస్సార్ నుండి వాటాను కొనుగోలు చేసిన వోదాఫోను నుంచి ఎలాగైనా 11000 కోట్లు రూపాయలను పన్నుగా రాబట్టే ప్రయత్నాలలో ఉన్న కేంద్రం వలన ఇన్వెస్టర్లలో భారత్ పై సానుకూలత దెబ్బ తింటుందని బ్రిటన్ ఆర్ధిక మంత్రి జార్జ్ ఆస్బోర్న్ అన్నారు. ఈ సవరణ పన్ను వలన ముందు ముందు భారత్లో పెట్టే విదేశీ కంపెనీల పెట్టుబ డులు ఆశాజనకంగా ఉండవని ఇప్పటికే విదేశీ కంపనీలు హెచ్చరిస్తున్నాయి. కింగ్ఫిషర్ సిబ్బంది సమ్మె: డిసెంబరు నుండి వేతనాలు లేక పనిచేస్తున్న సిబ్బంది వారు ఇచ్చిన నోటీసుకు కింగ్ఫిషర్ కంపెని ప్రమోటర్ మాల్య తమ సిబ్బందికి తప్పకుండ వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఆగిన 10 విమాన సర్వీసులను వెంటనే పునరుద్దరించాలని సిబ్బందిని కోరారు.
రాజీవ్ గాంధి విమానాశ్రయమునకు గ్రీన్ హౌస్ సర్టిఫికేట్:
శంషాబాద్ లో ఉన్న రాజీవ్ గాంధి అంతర్జాతీయ విమానాశ్రయమునకు 'ఐ ఎస్ ఓ 14064 -1 :2006 ' సర్టిఫికేట్ వచ్చింది. ఈ సర్టిఫికేట్ పొందిన వాటిలో భారత్ లో రెండో విమానాశ్రయముగా మరియు ఆసియాలో మూడో విమానాశ్రయముగా ఈ ఎయిర్పోర్ట్ కు గుర్తింపు లభించింది. గ్రీన్ హౌస్ గ్యాస్ ను తగ్గించేందుకు 2009 -2011 అకౌంటింగ్ సంవత్సరాలకు సంబంధించిన సమాచారం సంబంధించి ఈ గుర్తింపు లభించింది. బ్యూరో వెరిటాస్ అనే సంస్థ జరిపిన ఆడిట్ లో పరిశీలన తర్వాత సర్టిఫికేట్ ను జారీ చేశారని ఎయిర్ పోర్ట్ నిర్వహిస్తున్న జీ ఎచ్ ఐ ఎ ఎల్ ప్రకటించింది. ఈ సర్టిఫికేట్ పొందిన విమానాశ్రయాలలో ముంబై లోని చత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయము భారత్ లో మొదటి స్థానములో నిలిచింది.
విద్యుత్ చార్జీల పెంపు పరిశ్రమలకు భారం:
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీల వల్ల ముఖ్యముగా పరిశ్రమలు కనీస ఉత్పత్తి స్థాయికి చేరటం లేదని సి ఐ ఐ చైర్మన్ సుచిత్ర తమ అభిప్రాయాన్ని వెల్లడి చేయడం జరిగింది. పవర్ హాలిడై మరియు కోతల వల్ల పరిశ్రమలు డీలా పడుతున్నాయని చార్జీల పెంపు పరిశ్రమలను మరింత నష్టాలకు చేరే స్థితికి చేరుస్తుందని వారు తెలిపారు. పరిశ్రమల పై విద్యుత్ చార్జీల పెంపు వల్ల ద్రవ్యోల్బణానికి కారణ మౌతుందని ఫ్యాప్సి ప్రెసిడెంట్ వీ ఎస్ రాజు అన్నారు.